
దానిలో “వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చట్టం ముందు ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టింది ఆయన కుమారు జగన్మోహన్ రెడ్డే కదా?ఆరోజు అక్రమాస్తుల కేసులో ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళి, తన తండ్రి మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాలతో తనకు సంబందం లేదని కేసు వేశారు. తద్వారా ఈ కేసులో మొదటి ముద్దాయిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలబడాల్సి వచ్చింది,” అని అన్నారు.
నారా లోకేష్ ఈ ఇంటర్వ్యూ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, “పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే,” అంటూ ట్వీట్ చేశారు.
టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా…
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…