
ఈ విషయం థియేటరులో ఉన్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అరెస్ట్ చేశారు. తాను మెట్లు ఎక్కుతుంటే కాలు వాచిందని, జాతీయ గీతం వస్తుంటే నిలబడేందుకు ప్రయత్నించానని హుస్సేన్ చెప్పినప్పటికీ పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే ఆ తర్వాత నాలుగు గంటల పాటు స్టేషన్ లోనే ఉంచారని, తమ వారికి సమాచారం ఇచ్చేందుకు కూడా ఆస్కారం లేకుండా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారని పోలీసులపై ఆరోపణలు చేసారు.
అయితే తన సోదరుడు 9 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండి ఇటీవలే వచ్చాడని, ఇక్కడి చట్టాలపై సరైన అవగాహన లేదని న్యాయవాదిగా ఉన్న హుస్సేన్ అన్న తెలిపారు. అయినా జాతీయ గీతం వస్తుంటే లేచి నిలబడాల్సిన అవసరం లేదని గత నెల 14న సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని సమర్ధించే ప్రయత్నం చేసారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదు అవుతుండగా, తాజాగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కేసులు నమోదు కావడం విశేషం.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…