
మరో వారం రోజుల్లో నాంది పలకనున్న ఈ ఉదంతంలో… నిబిరు గ్రహం లేదా ప్లానెట్ ఎక్స్ భూమిని ఢీకొంటుందని, దీంతోపాటు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. 15వ తేదీతో మొదలై… వచ్చే ఏడేళ్లలో భూమి నామరూపాల్లేకుండా అంతమై పోతుందని, ఈ ఏడేళ్లూ మానవాళి నరకయాతన అనుభవించాల్సిందేనని అన్నారు. ప్రతి ఒక్కరూ మరణించే ముందు ఎంతో కష్టపడతారని చెప్పారు. అమెరికా, కరేబియన్ దీవుల్లో వచ్చిన వరదలు, మెక్సికోలో సంభవించిన భూకంపం వంటివి భూమి నాశనానికి సంకేతాలేనని చెప్పారు. వీటన్నింటికీ తోడు అణు విపత్తులు వస్తాయని, యుద్ధం కారణంగా అణుబాంబులు పడి సర్వనాశనానికి నాందిగా మారుతుందని తెలిపారు.
రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా ఓ వైపు, అమెరికా, బ్రిటన్ మరోవైపు నిలిచి పోరాడతాయని అంచనాలు వేసి చెప్పారు. అయితే గత నెల 23న నిబిరు భూమిని తాకుతుందని డేవ్ మీడ్ చెప్పినా అది జరగలేదన్న సంగతి తెలిసిందే. గత నెలలో తాను చిన్న తప్పు చేసి అక్టోబర్ 23ను అంచనా వేశానని చెప్పిన డేవ్ మీడ్, ఈసారి తన మాటలు నిజమవుతాయని అంటున్నారు. తన వ్యాఖ్యలకు ఉదాహరణగా, ఆగస్టు 21న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం తరువాత వరుస ఘటనలు ఎన్నో జరిగాయని డేవ్ మీడ్ గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు ఒకప్పుడు అయితే సంచలనంగా ఉండేవి గానీ, ప్రస్తుతం కామెడీగా మారిపోయాయి.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…