
ఈ నేపధ్యంలో హీరో నిఖిల్ ఇస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బ్లాక్ మనీ అంశంపై ప్రస్తావించారు. ‘మోడీ తీసుకున్న నిర్ణయం అద్భుతమని, గత వారంతో పోలిస్తే… ఈ వారం ప్రజల ఇబ్బంది కాస్త తగ్గిందని, ఓ 50 రూపాయలు ఉంటే సినిమా చూసేయొచ్చు అన్న నమ్మకంతో మా సినిమాను విడుదల చేస్తున్నామని’ చెప్పిన నిఖిల్, “తాను హీరోగా సంపాదిస్తున్నదంతా వైట్ మనీయే అని, నిజానికి దాచుకునేటంత తాను సంపాదించలేదని” చెప్పుకొచ్చారు.
ఈ సినిమా కధ చెప్పేస్తే ఫీల్ పోతుందని, అయితే రొటీన్ దెయ్యాల హర్రర్ మూవీల మాదిరి అయితే ఖచ్చితంగా మా సినిమా ఉండదని, ఈ రోజుల్లో కొత్తదనం లేకుండా ప్రేక్షకులను మెప్పించడం కష్టమని, అందుకే తన సినిమాలలో వైవిధ్యం కనపడుతుందని చెప్పాడు నిఖిల్. తానూ నటించిన సూపర్ హిట్ సినిమా “కార్తీకేయ”కు సీక్వెల్ వస్తుందని, ఇప్పటికే కధ సిద్ధమైందని, ‘కార్తికేయ’ సినిమాను మించి ఈ కధ ఉంటుందని, దర్శకుడు చందుకు ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే ఈ సినిమా మొదలవుతుందని చెప్పుకొచ్చారు.
Vijay was sworn in as the Chief Minister of Tamil Nadu on May 10 at…
Salman Khan’s upcoming superhero film with director duo Raj & DK has already created strong…