
మరో వైపు ఏటీఎంలో కూడా డబ్బులు నిండుకోవడంతో ప్రజల తిప్పలు పతాక స్థాయికి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో చాలా బ్యాంకులలో ఇప్పటికే డబ్బులు నిండుకోవడంతో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నేడు కూడా డబ్బులు చేరుకోలేకపోతే, దయనీయమైన పరిస్థితులలోకి ఏపీ జారుకుంటుందని స్వయంగా బ్యాంకు అధికారులే స్పష్టం చేస్తున్నారు. సగానికి పైగా ఏటీఎంలు గత 15 రోజులుగా పని చేయకపోగా, ప్రస్తుతం పనిచేస్తున్న ఏటీఎంలో డబ్బులు అయిపోయే పరిస్థితి నెలకొంది.
కరెన్సీ కొరత తలెత్తిందన్న విషయాన్ని ముందే గమనించిన అధికారులు విత్ డ్రాలను పూర్తిగా తగ్గించేసారు. 24000 ఉన్న విత్ డ్రాలను గత రెండు రోజులుగా కేవలం 4 వేలు, 2 వేలకే పరిమితం చేసారు. దీంతో పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అయితే బ్యాంకు మేనేజర్లు అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో కరెన్సీపై నియంత్రణ విధించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్యుడు కష్టాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…