
నోట్ల రద్దు న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం చూపిందని అసోచామ్ నివేదిక స్పష్టం చేసింది. నోట్ల రద్దు కారణంగా ఈ ఏడు స్టార్ హోటళ్లు న్యూ ఇయర్ వేడుకల టిక్కెట్ ధరలు సుమారు 2 నుంచి 3 శాతం వరకు తగ్గించాయని తెలిపింది. ఈ విషయం తాము అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ఇండోర్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబయి సహా దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లోని పలు స్టార్ హోటళ్లపై చేసిన సర్వేలో వెలుగు చూసిందని అసోచామ్ తెలిపింది.
ఇవి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్టార్ హోటళ్లలో న్యూ ఇయర్ బుకింగ్స్ 5 నుంచి 7 శాతం వరకు పడిపోయాయని చెప్పింది. ధరలు తగ్గించినా, డిస్కౌంట్లు ప్రకటించినా స్టార్ హోటళ్ల న్యూయర్ బుకింగ్స్ కలకళలాడడం లేదని, వెల వెలబోతున్నాయని పేర్కొంది. నోట్ల రద్దు కారణంగానే న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకునేందుకు పలువురు వెనుకాడుతున్నారని అసోచామ్ అభిప్రాయపడింది.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…