
ఇక, తెలంగాణా నుంచి నాగేశ్వర రెడ్డి (పద్మభూషణ్), సైనా నెహ్వాల్ (పద్మభూషణ్), సానియా మీర్జా (పద్మభూషణ్), టీవీ నారాయణ (పద్మశ్రీ), మన్నన్ గోపీచంద్ (పద్మశ్రీ), లక్ష్మా గౌడ్ (పద్మశ్రీ) లకు ఈ అవార్డులు లభించాయి. పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం గత సెప్టెంబరు 4 న కేంద్రానికి రెండు జాబితాలు పంపింది. మొదటి లిస్టులో 32 కొత్త పేర్లు ఉండగా, రెండో జాబితాలో 24 మంది పేర్లు ఉన్నాయి. వీటిలో లక్ష్మా గౌడ్ పేరును మాత్రమే పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారట.
పద్మవిభూషణ్ పురస్కారానికి విద్యావేత్త సీహెచ్ హనుమంత రావు, సాహితీవేత్త ప్రొఫెసర్ శివకుమార్ పేర్లను పంపినా వాటిని పక్కన పెట్టారు. రెండో లిస్టులో పీవీ నరసింహారావు పేరును ‘భారతరత్న’ పురస్కారానికి, జయశంకర్ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు పంపారు. అలాగే తెలంగాణా కవులు గోరేటి వెంకన్న, అందె శ్రీ సుద్దాల అశోక్ తేజ, విద్యావేత్త చుక్కా రామయ్య పేర్లను తెలంగాణా సర్కార్ సిఫారసు చేసింది. కానీ వాటిని కూడా అవార్డుల ఎంపిక కమిటీ పక్కన పెట్టింది.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…