
ఒక దశలో 106 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి పటిష్ట దశలో ఉన్న శ్రీలంక 119 పరుగులు చేరుకునే సమయానికి 9 వికెట్లు కోల్పోయిందంటే ఎంత పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో శ్రీలంక జట్టు మ్యాచ్ పై పట్టు సాధించింది. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా, అప్పటికే పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయింది.
ఈ తరుణంలో క్రీజులో ఉన్న షాబాద్ ఖాన్ ఒక బౌండరీ, సిక్సర్ సాధించి పాకిస్తాన్ కు విజయం అందించాడు. దీంతో పాకిస్తాన్ కు అనూహ్యమైన విజయం దక్కింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను పాక్ వైపుకు మలుపు తిప్పిన షాబాద్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో వరుసగా శ్రీలంకపై ఆరవ విజయాన్ని నమోదు చేసి ‘సిక్సర్’ సక్సెస్ ను అందుకుంది పాకిస్తాన్.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…