
మరి తాజాగా కాకినాడ సభలో ‘జనసేన’ అధినేత ఏం చెప్పబోతున్నారు? తిరుపతి వేదికగా కేంద్ర వైఖరిని తూర్పారపట్టిన పవన్, కాకినాడలో టిడిపిని టార్గెట్ చేస్తారన్న మాటలు తొలుత వినిపించాయి. అయితే, తాజాగా కేంద్రం ప్యాకేజ్ ప్రకటించిన దరిమిలా, ఏ వైఖరితో ప్రజల ముందుకు పవన్ వస్తారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. దీనిపై చంద్రబాబు కూడా స్పందిస్తూ… ప్యాకేజ్ తర్వాత పవన్ ఎలా స్పందిస్తారో చూద్దాం… ఎవరైనా అభివృద్ధితో కలిసి వస్తే తాము స్వాగతిస్తాం అన్నట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ‘పవన్ యొక్క విలువను’ చాటిచెప్తున్నాయి.
మరో పక్కన పవన్ వేడుకకు సర్వం సన్నద్దమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో జరగనున్న ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ను ముస్తాబు చేసే బాధ్యతను ‘జనసేన’ కార్యకర్తలు, అభిమానులు తీసుకున్నారు. ఒక్క కాకినాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తానని పవన్ తిరుపతిలో ప్రకటించిన దరిమిలా… తన భవిష్యత్తు కార్యాచరణపై కాకినాడలో పవన్ ఎలా ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Agadha is rewriting promo rules: its teaser has skyrocketed to over 10 million digital views…
Mega Power Star Ram Charan is set to unleash a cinematic storm with his highly…