
“దేశ స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఆవిర్భాల దినోత్సవాలను మాత్రమే పార్టీ వేడుకలుగా చేసుకుంటుందని, ఆ రోజులను మాత్రమే సెలవు దినాలుగా పరిగణిస్తామని” కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న ‘వ్యక్తి పూజ’కు తిలోదకాలు ఇస్తూ… వ్యక్తి జయంతులనేవి రాజకీయాల కోసం ఏర్పాటు చేసినవేనని, అలాంటి వాటిని ‘జనసేన’ పరిగణనలోనికి తీసుకోదని, అలాగే మతపరమైన పండుగలను, పర్వదినాలను సెలవులుగా ప్రకటించడమనేది రాజకీయాల్లో భాగంగా అని తేల్చేసింది.
జాతీయ సమగ్రతకు ఇలాంటి అంశాలు దోహదపడవని, అందుకే వాటిని వ్యతిరేకిస్తుందని ‘జనసేన’ జారీ చేసిన ఓ స్పష్టమైన ప్రకటన నవతరం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రాజకీయాల్లో మార్పు కావాలని ఆశిస్తున్న వారిని ఈ సిద్ధాంతాలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే కొత్త నాయకులను తయారు చేయడం కూడా ‘జనసేన’ లక్ష్యాలలో ఒకటిగా ఉంది. అయితే ఇవన్నీ పేపర్ వరకు పరిమితం కాకుండా, కార్యరూపం సిద్ధించుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…