
తరువాత అవిశ్వాసతీర్మాణం పెడితే దేశమంతా తిరిగి జాతీయ పార్టీలతో మాట్లాడి మద్దత్తు కూడగడతా అని చెప్పి అవిశ్వాసం పెట్టాక దాని వల్ల ఉపయోగం లేదని తప్పించుకున్నారు. తెలంగాణ పోరాటం మాదిరిగా అన్ని పార్టీలు కలిసి స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చెయ్యాలని, అఖిలపక్షం పెట్టి జేఏసీ లాంటిది పెట్టాలని కోరిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అఖిలపక్షం పెడితే దాని వల్ల ఉపయోగం లేదని జనసేన హాజరు అవ్వకుండా డుమ్మా కొట్టింది.
ఇలా చెప్పిన మాట మళ్ళీ చెప్పకుండా ఉంటే జనసేనకు విశ్వసనీయత లేకుండా పోతుంది. అది ఆయన రాజకీయ మనుగడకే ప్రమాదం అని తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ కే మంచిది. జనసేనతో పాటు బీజేపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ కూడా అఖిలపక్షాన్ని బహిష్కరించాయి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…