
నష్టాలలో ఉన్న సాలెం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానిని కలిసి ఒక మెమొరాండం ఇచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ… కనీసం ఈ విధంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఏం అడ్డు వచ్చిందో? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఏపీ నేతల నుండి కనీసం పోరాటపటిమ కూడా లేదంటూ ఈ సందర్భంగా ఎత్తిచూపారు ‘జనసేన’ అధినేత. ఒక సమస్యను అక్కడితో వదిలేయకుండా, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడడం తన నైజంగా పవన్ మరోసారి చాటుకున్నారు.
సాధారణంగా రాజకీయ నాయకులైతే ఒకసారి వచ్చి పరామర్శించిన తర్వాత ఇక ఆ సమస్యను గాలికి వదిలేసినట్లే భావించవచ్చు. ఇంకా చెప్పాలంటే… “ఏదైనా అధికారం ఉంటేనే” అన్న కోణంలో ప్రజలకు స్పీచ్ లు ఇస్తారు. కానీ పవన్ మాత్రం, ఒక సమస్యను పట్టుకుంటే, వాటిపై ప్రభుత్వాలు దిగి వచ్చేదాకా పోరాడడం హర్షించదగ్గ విషయం. గతంలో ‘ఉద్దనం’ కిడ్నీ బాధితుల వ్యవహారంలో కూడా పవన్ సమస్య పరిష్కారం అయ్యే దాకా వరుసగా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఇతర నేతల నుండి పవన్ ను వేరు చేస్తోందని చెప్పవచ్చు.
భారత్ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…