
దీనిపై పీఎంవో నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గౌతమి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. అయితే ఈ సారి బహిరంగ లేఖతో కొట్టింది. ప్రధాని మోడీ తమిళనాడు సమస్యలను పట్టించుకోవడం లేదని ఈ లేఖలో ఆరోపించింది. అంతే కాకుండా గతంలో తాను రాసిన లేఖపై ఇంతవరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటూ దేశ ప్రజలను ఉద్దేశించి గొప్ప గొప్ప ప్రసంగాలు చెబుతారని గుర్తు చేసిన ఆమె, తాను రాసిన లేఖపై ఇంతవరకు స్పందించలేదని ప్రశ్నించింది.
భారతదేశమంతా తనకు ఒకటేనని మోడీ భావిస్తే, దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడులో ఏర్పడిన సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించింది. జయలలిత మృతిపై ప్రజల్లో ఏర్పడిన సందేహాలను ఎందుకు నివృత్తి చేయలేదని అడిగింది. గౌతమీ ప్రశ్నల వర్షం ఒక్క తమిళనాడు గురించే అయినా… దక్షిణాది గురించి ప్రత్యేకంగా పేర్కొనడంతో… భవిష్యత్తులో ఉత్తరాది – దక్షిణాది మధ్య కాస్త దూరం పెరిగే సంకేతాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాల నుండి ఈ మాటలు వ్యక్తమవుతుండడం, వీటికి మరింత ప్రాధాన్యతను చేకూరేలా చేస్తున్నాయి.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…