
సింగిల్ మ్యాచ్ లో ఏకంగా 16 పాయింట్లను సాధించిన పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ తన జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు. పాంథర్స్ కెప్టెన్ జస్వీర్ సింగ్ ఒంటిచేత్తో 13 పాయింట్లు సాధించినా పైరేట్స్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. మ్యాచ్ లో తొలి అర్ధభాగం ముగిసే సరికి పైరేట్స్ తో సరిసమానంగా 16 పాయింట్లు సాధించిన పాంథర్స్…. సెకండాఫ్ లో పూర్తిగా నిరాశజనకమైన ఆట తీరుని ప్రదర్శించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పైరేట్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా జూలు విదల్చడంతో, ప్రొ కబడ్డీలో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది.
ఇక, ప్లే ఆఫ్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ – పూణేరి పల్తాన్ జట్లు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో… చివరి నిముషంలో జరిగిన డ్రామాతో విజయం పూణేరి పల్తాన్ వశమైంది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రానాలు మరోసారి స్టేడియంలో సందడి చేసి, తెలుగు టైటాన్స్ కు అండగా నిలిచారు. అయినప్పటికీ, చివరి నిముషంలో ఒత్తిడి తట్టుకోలేక తెలుగు టైటాన్స్ చేతులెత్తేసింది.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…