
సింధూ ఎంత కష్టపడిందో, అంతకన్నా ఎక్కువగా గోపీచంద్ కష్టపడ్డారని, వీరిద్దరూ సినిమాలు, విందు వినోదాలకు దూరంగా ఉంటూ వచ్చారని, బాగా దగ్గరి బంధువుల ఇంట శుభకార్యాలకు కూడా సింధూ హాజరు కాలేదని చెప్పారు. ఇష్టమైన ఆహారానికి కూడా దూరమైందని, బ్యాడ్మింటనే తన ప్రపంచం అన్నంతగా మారిపోయిందని, ఆ కష్టం నేడు సఫలీకృతం కావడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు.
తెల్లవారుఝామున 3:30 గంటలకు ఆమెను లేపడానికి తమకు ఎంతో ఇబ్బంది అనిపించేదని, అయినా, ‘సింధూ టైమ్ అయింది’ అన్న తమ మాటలు వినగానే ‘డాడీ… 5 మినిట్స్’ అని చెప్పి వెంటనే రెడీ అయిపోయి 4 గంటల కెల్లా బయలుదేరి అకాడమీకి వెళ్లిపోయిందని సింధు పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అంత అనిర్వచనీయమైన కష్టం పడబట్టే, నేడు కోట్లాది ప్రజల అభిమానాన్ని పొందగలిగింది అంటున్నారు వీక్షకులు.
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. కనుక…
It has been nearly a month since Andhra Pradesh deputy chief minister, Pawan Kalyan sustained…