
దశాబ్ధాల క్రితం గల్ఫ్ దేశాలలో తొలిసారిగా ఉద్యోగాలు పుట్టుకొచ్చినప్పుడు, దశాబ్ధాల క్రితమే అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు అవకాశం ఉందని గుర్తించినప్పుడు, దేశంలో తొలిసారిగా ఐటి రంగం పరిచయమైనప్పుడు ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నవారు జీవితంలో ఎంతగానో రాణించారు.
అయితే చాలామంది పాలకులు అటువంటి గొప్ప అవకాశాలను సకాలంలో గుర్తించలేకపోవడం వలన ప్రజలకు ఆ ఫలాలు లభించవు. లభించేసరికి అంత అయిపోతుంది.
సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటి రంగానికి అద్భుతమైన భవిష్యత్ ఉందని గ్రహించి, హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి ఐటి కంపెనీలను రప్పించారు. ఆ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ కాలేజీలను, ఉన్నత విద్యాసంస్థలని ప్రోత్సహించారు.
నాడు సిఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోకపోయి ఉంటే, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలలో ఇన్ని లక్షల మంది తెలుగువారు కనిపించి ఉండేవారు కారు.
దేశంలో మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఐటి రంగంపై ఆసక్తి, అవగాహన చాలా ఎక్కువే. ఈ రంగంలో ఎప్పటికప్పుడు అందివచ్చే సరికొత్త టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకుంటూ, దానిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఆ టెక్నాలజీలో యువత నైపుణ్యం పెంచుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంటారు. ఐటి, టెక్నాలజీ రంగాలలో ఆసక్తి, అవగాహన కలిగిన చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టమే అని చెప్పవచ్చు.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్లో హైటెక్ సిటీల వంటి ఓ ఐటి సెంటర్, అమరావతిలో కూడా ఉండాలనుకున్న సిఎం చంద్రబాబు నాయుడు 50 ఎకరాలలో ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటు చేయిస్తున్నారు. దీనిలో రూ.4,000 కోట్లతో బహుళ అంతస్తుల భవన సముదాయాలు నిర్మిస్తారు. వచ్చే ఏడాది జనవరి 1న ఈ పనులు ప్రారంభం కానున్నాయి.
After being a relentless supporter for YS Jagan, all her life, Sharmila changed the track…
Ramayana is one of the most expensive Indian films in the making. Produced by Namit…