
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ శూన్యత నేపథ్యంలో… రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఇప్పటికే రకరకాల చర్చలు జరిగాయి. ఓ పక్కన రావాలని అభిమానులు పిలుపునిస్తుండగా, స్వతహాగా రాజకీయాలకు దూరంగా ఉండే రజనీ సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అయితే రజనీ సోదరుడు మాత్రం ఒకటి, రెండు సందర్భాలలో ఫ్యాన్స్ కు పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
తాజాగా శ్రీలంకలో తమిళులను కలవవద్దంటూ పలు పార్టీలు సూచించిన నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్న రజనీ, ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆయన ఏప్రిల్ 2న అభిమానులంతా చెన్నై రావాలని లేఖలు రాయడంతో, సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రానున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే ఇది సాధారణ సమావేశమేనని, ఇటీవలే కమల్ హాసన్ కూడా తన అభిమానులతో సమావేశం నిర్వహించాడని గుర్తు చేస్తున్నారు.
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…