
నేడు పార్లమెంట్ లో కేవీపీ బిల్లును తప్పించుకునేందుకు బిజెపి చేసిన విధానాన్ని తప్పుపడుతూ… ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో పెట్టకపోవడమన్నది కేవలం అవగాహనా రాహిత్యపు వ్యాఖ్యలేనని విమర్శలు చేసారు ఈ రాజ్యసభ సభ్యుడు. నిజమే… ఏపీ ప్రజల కోణాలలో ఆలోచనలు చేస్తే, బిజెపి అనుసరిస్తోన్న విధానం విమర్శలకు తావిచ్చే అంశమే. అయితే బిజెపి ఈ రోజు ఇలా దోబూచులాడడానికి మరియు రాజకీయ కపట నాటకాలు ఆడే అవకాశం కల్పించింది ఎవరు? అన్న ప్రశ్న చిరంజీవికి తలెత్తితే, బహుశా అవగాహనా గురించి ప్రసంగించరేమో!
నాడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను ఆశించి… కేసీఆర్ అండతో తెలంగాణాలో, జగన్ అండతో ఆంధ్రప్రదేశ్ లో జెండా పాతాలని కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడు మైక్ ల ముందు ప్రసంగాలు ఇచ్చే చిరంజీవి వంటి నేతలు… ఏ విధమైన కుటిల రాజకీయాలు చేసారో… ప్రస్తుతం బిజెపి కూడా అలాంటి విధానాలనే అవలంభిస్తోంది. కాంగ్రెస్ చూపిన దోవలోనే నడుస్తున్న బిజెపి వలన నష్టపోతోంది చిరంజీవి కాదు, మోడీ కాదు… ఏపీ ప్రజలు. ఇలాంటి తరుణంలో కూడా కాంగ్రెస్ నేతలు మళ్ళీ నీచ రాజకీయాలకు పాల్పడుతూ… ఏపీ పరిస్థితిని మరింత జటిలం చేయాలని ప్రయత్నిస్తుండడమే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అసలు అవగాహన.
Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…
Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…