
కేసీఆర్ సర్కార్ చేపట్టిన “హరితహారం” ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటైన ఓ కార్యక్రమంలో రాశి, రకుల్ లు భాగస్వామి అయ్యి సందడి చేశారు. పార్కు వద్ద ఉన్న సందర్శకులకు స్వయంగా తమ చేతులతో మొక్కలను పంపిణీ చేసిన పిదప, మరికొన్ని మొక్కలను నాటి తమ స్వహస్తాలతో నాటి, నీళ్ళు పోసారు. ఈ ముద్దుగుమ్మల సామాజిక కార్యక్రమాలు చూసి అభినందించడం స్థానికుల వంతయ్యింది.
ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించిన వారమవుతామని రకుల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొన్నారు.
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…