
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధ్రువ’ సినిమాను చేస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. అయితే సుకుమార్ తర్వాత ప్రాజెక్ట్ ఎవరిది? అంటే దానికి సమాధానమే ఈ షాకింగ్ నిర్ణయం. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాలతో రెండు వరుస విజయాలు అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చెర్రీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
మరో విశేషమేమిటంటే… అదేదో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి కాదు… ‘ఆరంజ్’ తర్వాత ప్రేమకధలను పట్టుకొని చెర్రీ, ఈ సినిమాతో మళ్ళీ ఓ ప్రేమకధా చిత్రంలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే రామ్ చరణ్ ఆలోచనల్లో పెను మార్పు వచ్చినట్లుగానే భావించవచ్చని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఒక విధంగా సుకుమార్ సినిమాను ఒప్పుకోవడమే ప్రత్యేకంగా చెప్పుకుంటున్న వారికి, ఇప్పుడు మేర్లపాక గాంధీ సినిమాను ఒప్పుకోవడం కూడా అవాక్కయ్యే విషయమే!
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…