
వీటికి మరింత బలాన్నిచ్చే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమా కధ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ తన అనుభూతులను వెల్లడించగా, తాజాగా ఈ సినిమాకు పాటలను అందించనున్న రామజోగయ్య శాస్త్రి ‘యంగ్ టైగర్’ అభిమానులకు ఓ తీపికబురును అందించారు. “మ్యాటర్ ఏంటంటే… ఈ రోజు దర్శకుడు బాబీ వచ్చి కలిసారు. మళ్ళీ మా జూనియర్ ఎన్టీఆర్ – దేవిశ్రీప్రసాద్ తో… అద్దీ ఆనందం… మాంచి పాటలు ఉంటాయి… పక్కాగా… అమ్మతోడు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
రామజోగయ్య ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే… ఈ సినిమా కధ ఏ రేంజ్ లో ఉందన్న విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తను రాసే అన్ని చిత్రాల గురించి పెద్దగా సోషల్ మీడియాలో స్పందించని శాస్త్రి గారు, ఈ సినిమాపై తన అభిప్రాయం చెప్పారంటే… కధలో విషయం ఓ రేంజ్ లో ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు. దీంతో రోజులు గడిచే కొద్ది, ఈ సినిమాపై ‘యంగ్ టైగర్’ అభిమానుల అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో జూనియర్ పోషించబోయే మూడు పాత్రలలో ఒకటి క్రికెటర్ అన్న టాక్ హల్చల్ చేస్తోంది.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర…
Prime Minister Modi’s relentless energy is the ultimate case study in discipline. Just days ago,…