Telugu

జియో న్యూ రికార్డ్… నెంబర్ 1 కబ్జా..!

మార్చి 31వ తేదీతో ‘ఆల్ ఫ్రీ ఆఫర్స్’ ముగుస్తున్న వేళ రిలయన్స్ జియో మరో మైలురాయిని చేరుకుంది. జియోకు ప్రస్తుతం 10 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, ఇప్పటి వరకు 5 కోట్ల మంది వినియోగదారులు ‘ప్రైమ్’ క్లబ్‌లో చేరినట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ శుక్రవారం నాటితో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ ముగుస్తుండడంతో 99 రూపాయలు చెల్లించి జియో ప్రైమ్ మెంబర్లుగా మారాలని ఇదివరకే సూచించింది.

ADVERTISEMENT

ఈ ప్రైమ్ మెంబర్ గా తదుపరి ఏడాది పాటు ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ను పొందే వీలుంటుందని, అందుకు తగిన విధంగా 303 రూపాయలతో రీ ఛార్జ్ చేయించుకోవాలని ప్లాన్స్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం జియోకు 10-11 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, వీరిలో 30 శాతం మంది కేవలం డేటా వినియోగానికి మాత్రమే జియోను తీసుకున్నట్టు అంచనా. దీంతో మిగిలిన ఏడు కోట్ల మంది వినియోగదారులను చెల్లింపు వినియోగదారులుగా మార్చుకోవాలని భావిస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 కోట్ల మంది ప్రైమ్ మెంబర్లుగా చేరడంతో, ఈ 5 కోట్ల మంది వినియోగదారులతో రిలయన్స్ జియో దేశంలో అతి పెద్ద బ్రాడ్‌ బ్యాండ్ సేవలు అందిస్తున్న సంస్థగా అవతరించనుంది. ఇప్పటి వరకు ఈ స్థానాన్ని భారతీ ఎయిర్‌టెల్ ఆక్రమించింది. గత డిసెంబరు నాటికి ఆ సంస్థకు 3.7 కోట్ల మంది వినియోగదారులున్నారు. డిసెంబరుకు మూడు నెలల ముందు ఎయిర్‌టెల్‌ కు 4.1 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా, జియో రాకతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kaaka Out of Sankranthi? Big Release Buzz Around Chiru

There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…

11 minutes ago

ఇంత అయోమయం దేనికి రాజా?

రాహుల్‌ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…

19 minutes ago