
ఇప్పటికే పని ప్రారంభించిన సదరు కమిషన్ ను కలిసేందుకు విజయవాడ వెళ్లిన అఖిల భారత కాపు సంఘం నేతలు… కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయను వెంటబెట్టుకుని జస్టిస్ మంజునాథతో భేటీ అయ్యారు. తమ సామాజిక వర్గపు రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చాలని వారు ఓ వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ సందర్భంగా జస్టిస్ మంజునాథ చేసిన కామెంట్స్ తో కాపు నేతలు అవాక్కయ్యారని సమాచారం.
“కాపుల్లో ఐదు శాతమే ఉన్నతంగా ఉన్నారని మీరు చెబుతున్నారు. కానీ కొన్ని సంఘాలు కాపుల్లో 95 శాతం అభివృద్ధి చెందారని, ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కాపులే అధికంగా ఉన్నారని కూడా ఆ సంఘాలు చెబుతున్నాయి” అని జస్టిస్ మంజునాథ చేసిన వ్యాఖ్యలతో కాపు నేతలు షాక్ తిన్నారట. రాష్ట్రంలో ఒక్క సామాజిక వర్గం మినహా మిగిలిన అన్ని వర్గాలూ రిజర్వేషన్లను కోరుతున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…