
మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన మీడియాపై “రోబో 2.0” సెట్స్ పై దాడి చేస్తే ఊరుకుంటారా? తమిళనాడులోని ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ చేసి షూటింగ్ జరుపుతున్న “రోబో 2.0”ను కవర్ చేసేందుకు, ఇద్దరు మీడియా ప్రతినిధులు వెళ్ళగా, ఇది చూసిన బౌన్సర్లు ‘ఎందుకు ఫోటోలు తీసారంటూ’ దాడి చేసారు. దీంతో విషయం పోలీసు స్టేషన్ దాకా వెళ్ళడంతో… ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు శంకర్ కలుగ జేసుకోక తప్పలేదు.
“తనకు తెలియకుండా జరిగిన విషయమని, అయినప్పటికీ మీడియా ప్రతినిధులను క్షమించమని కోరుతున్నానని, రెండు చేతులు జోడించి దర్శకుడు శంకర్ నమస్కారం పెట్టడంతో” శాంతించిన మీడియా ప్రతినిధులు సదరు ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. ఎంతటి టాప్ దర్శకులైనా మీడియా ముందు ఎంతో అన్న విషయం ఈ సందర్భంగా రుజువైంది. రేపు సినిమా విడుదలైన రోజున మరి ఆ మీడియానే కదా… ‘సినిమా కేక… తోపు…’ అని చెప్పాల్సింది. ఈ పరిణామంతో మీడియా పవర్ ఏంటో మరోసారి చాటిచెప్పినట్లయ్యింది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…