
ప్రభుత్వం చెప్పిన విధంగానే నేడు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణ ప్రకటించిన బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయించారు. దీంతో ముద్రగడ చేస్తున్న ఆరోపణలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇక, ముద్రగడ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. “తానూ చేయదలచుకున్న దీక్షను వాయిదా వేస్తున్నానని, ప్రస్తుతం బడ్జెట్ లో కేటాయించిన నిధులు సరిపోవని, మరో పది రోజుల్లో ఒక్కో జిల్లా నుండి పది మందిని పిలిపించి చర్చిస్తానని, భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని” అన్నారు.
తాజా పరిణామాలతో ప్రభుత్వం వద్ద చిత్తశుద్ది లేదంటూ వ్యాఖ్యానించిన ముద్రగడ నాలుక కరచుకునే పరిస్తితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు ముద్రగడ ద్వారా జగన్ సాగించాలనుకున్న రాజకీయ ఎత్తుగడ కూడా విఫలమైందనే మాటలు వినపడుతున్నాయి.
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…