
ఈ స్థాయిలో నష్టం వస్తుందని ఊహించని సల్మాన్, వారి అభ్యర్ధనలను పరిశీలనలోకి తీసుకుని దాదాపుగా 55 కోట్ల మేర తిరిగి చెల్లించబోతున్నాడని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు కేవలం 114 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా కలెక్షన్లు దాదాపుగా క్లోజింగ్ దశకు చేరుకున్నాయి. దీంతో తప్పని పరిస్థితులలో డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను పూడ్చడానికి నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామంగా కీర్తిస్తున్నారు.
మరో పక్కన సల్మాన్ “టైగర్ జిందా హై” సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో సల్మాన్, కత్రీనా కైఫ్ జంటగా వచ్చి సూపర్ హిట్టైన “ఏక్ థా టైగర్” సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడంతో, ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి ఎలాంటి పండగ సీజన్లు చూసుకోకుండా తన సినిమాలను విడుదల చేయడానికే సల్మాన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Fans finally have a major update on Dragon, the much-awaited collaboration between Jr. NTR and…