
మరో వైపు సాయంత్రం 5 గంటల సమయంలో గవర్నర్ ను కలిసిన అనంతరం పన్నీర్ సెల్వం ముఖంలో సంతోషం, విజయం సాధించానన్న గర్వం కనిపించగా, శశికళలో మాత్రం నైరాశ్యత కనిపించడంతో అసలు గవర్నర్ ఈ ఇద్దరికీ ఏం చెప్పారా? అన్న ఆసక్తి నెలకొంది. తమిళనాడు రాజకీయాల్లో గవర్నర్ పాత్ర కీలకం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే, జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉన్న కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డప్పటికీ, లిస్టింగ్ లో ఈ కేసు నమోదు కాలేదు.
దీంతో ఈ కేసుపై తీర్పు వచ్చే వారంలో వెలువడే అవకాశముందని తెలుస్తోంది. కాగా, ఈ అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చడం, ఈ తీర్పును సవాల్ చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేయడం విదితమే. అయితే, ఈ కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జయలలిత మృతి చెందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ సీఎం పదవికి పోటీ పడుతుండటంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…