
మరోవైపు పన్నీర్ మాత్రం, జయలలిత వారసుడిని తానే అని విధంగా ప్రజల్లో నమ్మకం కలిగించడంలో సక్సెస్ అయ్యారు. జయలలిత సమాధి వద్ద మౌన దీక్ష చేయడం నుండి శశికళ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారో అనే విషయం తెలుసుకోవడం వరకు బాగా జాగ్రత్తపడిన పన్నీర్, ఏకంగా జయలలిత మరణాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అమ్మను చూడడానికి హాస్పిటల్ లో తనకు కూడా శశికళ అనుమతి ఇవ్వలేదని, జయలలిత మరణంపై హైకోర్ట్ జడ్జితో విచారణ జరిపించాలని, అవసరమైతే తన రాజీనామాను వెనక్కి తీసుకునే ఆలోచనలు కూడా ఉన్నట్లు పన్నీర్ సెల్వం సెలవిచ్చారు.
క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్న తమిళనాట రాజకీయాలు ప్రజలకే కాదు, దేశ రాజకీయ వర్గాలనే ఆకర్షిస్తున్నారు. ఒక అనధికార వెబ్ సైట్ ప్రకారం… ప్రజలంతా పన్నీర్ వైపే ఉండగా, ముఖ్యమంత్రిగా పన్నీర్ కాకపోతే, రాష్ట్రపతి పాలన అయినా విధించండి గానీ, శశికళను మాత్రం జయలలితకు వారసురాలిగా అంగీకరించేది లేదని తేల్చిచెప్తున్నారు. ఈ పోరులో చివరికి ఎవరు విజయం సాధిస్తారో గానీ, సోషల్ మీడియాలో మాత్రం పన్నీర్ సెల్వం ప్రస్తుతానికి హీరో అయిపోయారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…