
మరోవైపు కాంక్రీట్ పనుల్లో నాణ్యత ఉందని మసూద్ కమిటీ స్పష్టం చేసింది. పోలవరం పరిహారం, పునరావాసంపై ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించి, నిర్వాసితులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన పునరావాసంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని నివేదికలో పేర్కొన్నారు.
బాధితుల స్టేట్మెంట్లను కూడా కమిటీ రికార్డు చేసింది. ఈ నివేదికను మూడు రోజుల క్రితం కమిటీ కేంద్రానికి అందజేసింది. ప్రధాని, కేంద్ర హోం శాఖ, నాబార్డ్, ఏపీ ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఈ నివేదికను ఈరోజో రేపో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. పోలవరంలో అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న వారిలో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. దీనితో ఆయనకు కూడా కనువిప్పు కలిగినట్టు అయ్యింది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…