
ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లోనే అవాక్కయ్యే బంతులను విసిరి, ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పతిప్పలు పెట్టాడు. గత ఏడాది కాలంగా జట్టులో రాణిస్తున్న అశ్విన్ – జడేజాల బౌలింగ్ లో తృణప్రాయంగా పరుగులు చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్లు, కులదీప్ బౌలింగ్ లో మాత్రం ఆచితూచి ఆడడం విశేషం. అంతలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన కులదీప్ కు వార్నర్ రూపంలో తొలి వికెట్ లభించగా, ఆ తర్వాత అద్బుతమైన బంతులతో హ్యాండ్స్ కాంబ్, మాక్స్ వెల్ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో రెండవ సెషన్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరో ఎండ్ లో వికెట్లు పడుతోన్నా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మాత్రం మరో సెంచరీ బాదేసాడు. ఇండియాపై గత 8 టెస్టుల్లో 7వ సెంచరీని పూర్తి చేసుకున్న స్మిత్, టీ విరామానికి ముందు అవుట్ అయ్యాడు. చివరి సెషన్ లో కీపర్ వాడే అర్ధ సెంచరీ పూర్తి చేయడంతో, ఆసీస్ స్కోర్ బోర్డు సరిగ్గా 300 పరుగుల వద్ద ముగిసింది. కులదీప్ 4 వికెట్లతో సత్తా చాటగా, ఉమేష్ యాదవ్ 2, భువనేశ్వర్, జడేజాలు చెరో వికెట్ సొంతం చేసుకున్నారు.
సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుతమైన రనౌట్ తో కెఫీని పెవిలియన్ కు పంపాడు. మొత్తమ్మీద కోహ్లి లేకుండా ఎలా రాణిస్తుందా? అన్న ప్రశ్నకు టీమిండియా గట్టిగానే జవాబిచ్చింది. అయితే తదుపరి బాధ్యత బ్యాట్స్ మెన్ల వంతు. ఆసీస్ చేసిన 300 పరుగులకు ధీటుగా బ్యాటింగ్ లో రాణిస్తే… టీమిండియాకు సిరీస్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరో వైపు టీమిండియాను త్వరగా ఆలౌట్ చేయగలిగితే ఆసీస్ కూడా అంతే అవకాశాలు ఉంటాయి మరి! దీంతో సండే నాడు బ్యాట్స్ మెన్లు ఎలా రాణిస్తారు అన్నది కీలకంగా మారింది.
Hyderabad is set to get another premium single-screen theatre. Mythri Movie Makers has taken Dilsukhnagar’s…
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…