
‘మా’ అధ్యక్షుడిగా శివాజీ రాజాను ఏకగ్రీవంగా ఎంపిక చేసినప్పటి నుండి రాజేంద్ర ప్రసాద్ కనిపించకపోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. బహుశా మా అధ్యక్షుడి పదవికి శివాజీ రాజాను ఎన్నుకోవడం రాజేంద్ర ప్రసాద్ కు ఇష్టం లేదనే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, గత రెండేళ్లుగా ‘మా’ అభ్యున్నతికి రాజేంద్ర ప్రసాద్ బాగానే కృషి చేశారని, ‘మా’ అధ్యక్ష బాధ్యతలు రెండోసారి కూడా ఆయనకే దక్కుతాయని నటకిరీటీ వర్గీయులు భావించినట్లుగా తెలుస్తోంది.
కానీ ‘మా’ కోసం శివాజీరాజా కష్టపడటాన్ని చూసిన సినీ పెద్దలు, ఆ పదవిని ఆయనకే కట్టబెట్టాలని అనుకోవడంతో రాజేంద్రప్రసాద్ కు మరొక ఆప్షన్ లేకుండా పోయింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడి హోదాలో అయినా ప్రెస్ మీట్స్ కు రాజేంద్ర ప్రసాద్ హాజరు కాకపోవడం, ‘మా’ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికపై కనీసం తన స్పందన తెలియజేయక పోవడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో ‘నటకిరీటి’ కనిపించడం లేదంటూ ప్రచారం ఊపందుకుంది.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…