
‘తానూ ఏ ఒక్క కులం గురించో పోరాడడం లేదని, ప్రత్యేక హోదా తప్ప మరో లక్ష్యం తనకు లేదని, ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నానని, పాలక, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని’ అన్నారు. ‘ఏపీలో పుట్టాం… ఏపీ రుణం తీర్చుకుంటాం…’ అంటూ నినదించిన శివాజీ, ఎట్టి పరిస్థితులలోనూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించవద్దని సూచనలు చేసారు.
పుష్కర స్నానం వేళ… ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ రావాలని ఆశిస్తూ ప్రాణాలు అర్పించిన వారికి పిండ ప్రధానం చేసానని, వీరితో పాటు ‘ప్రత్యేక హోదా’ను ఇవ్వకుండా అడ్డుపడుతున్న వారికి కూడా పిండ ప్రధానాలు చేసానని… పరోక్షంగా బిజెపిపై తీవ్ర మండిపాటు వ్యాఖ్యలను చేసారు. హోదా కోసం పోరాడుతున్న తనపై విమర్శలు చేసే స్థాయి వారికి లేదంటూ ప్రధానంగా కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శల వర్షం కురిపించారు.
ఏరో స్పేస్, రక్షణ రంగాలలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను అనుమతించిన తర్వాత అనేక స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలో…
ఎన్నికలలో రాజకీయ పార్టీల జయాపజయాలు సహజమే. తమిళనాడు మాజీ సిఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే తప్పకుండా గెలుస్తుందని సర్వేలు…