
ఒకవేళ ఏపీలో అడుగుపెడితే రాష్ట్ర విభజన, ఆంద్రులను అవమానించడం మొదలు నీళ్ళు, ఆస్తుల పంపకాలు, బకాయిల ఎగవేత, పోలవరంపై బిఆర్ఎస్ వైఖరి వంటి చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. ఇది ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అదీగాక ఏపీలో వైసీపీ, టిడిపిలు చాలా బలంగా ఉన్నాయి. జనసేన, బిజెపిలకు ఎంతో కొంత పట్టుంది. వాటన్నిటి కులసమీకరణాల లెక్కలు వేరే ఉన్నాయి. కనుక కేసీఆర్ తొందరపడి ఏపీలో ప్రవేశిస్తే ఎదురుదెబ్బ తగిలితే అది ఆయన జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఆయన తనకు అనుకూలంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలలో అడుగుపెట్టాలని నిర్ణయించుకొన్నట్లు భావించవచ్చు.
అయితే ఏపీలో ఎదురయ్యే ఈ ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ సమాధానాలు సిద్దం చేసుకొని, ఏపీలో ఉండవల్లి అరుణ్కుమార్ వంటి రాజకీయ నిరుద్యోగులను, అసంతృప్తులను కూడగట్టుకొన్నాక తప్పకుండా ఏపీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయం. అది మూడు నెలల్లోనా… ఆరు నెలల్లోనా… లేక వచ్చే ఎన్నికలలోనా అనేది అప్రస్తుతం. కానీ కేసీఆర్ లేటుగా వచ్చినా లేటెస్టుగానే వస్తారు. కనుక సమరమా శరణమా అనేది ఏపీలో అన్ని పార్టీలు తేల్చుకోకతప్పదు.
బిఆర్ఎస్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన రాజకీయ వ్యవహారమే కాకుండా జాతీయస్థాయి వ్యవహారం కూడా దానితో ఎటువంటి వైఖరి అవలంభించాలి?అనే అంశంపై వైసీపీ, టిడిపి, జనసేన మూడు పార్టీలు అంతర్గతంగా చర్చించుకొంటున్నాయి. ఏపీలోకి బిఆర్ఎస్ ఎంట్రీని వైసీపీ మంత్రులు తేలికగా కొట్టిపడేస్తుండగా టిడిపి, జనసేనలు ఇంతవరకు స్పందించలేదు. కానీ త్వరలో స్పందించక తప్పదు.
టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా…
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…