
ఖాతాల్లో కనీసం 5000 రూపాయలను తాము ఉంచలేమని, అవసరమైతే ఖాతాలను మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ డబ్బులు తాము తీసుకునేందుకు ఈ ఆంక్షలేమిటో అంటూ బ్యాంకుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలా తమ రక్తాన్ని నుంచి పిండి, మాల్యా లాంటి వారికి అప్పులు ఇచ్చేందుకు ఇటువంటి నిబంధనలు విధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని బ్యాంకులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నాయని అంటున్నారు.
ఇక సహించడం తమ వల్ల కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి తెరలేపారు. అసలు ఈ గోలంతా ఎందుకు? ఖాతాలు క్లోజ్ చేసి ఆ సొమ్మేదో తమ వద్దే భద్రంగా దాచుకుంటామని, అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ల గొడవ, ఏటీఎంల గొడవ ఉండదని చెబుతున్నారు. ఎస్బీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుందా సరేసరి, లేకుంటే దేశవ్యాప్తంగా సామాన్యులు తమ ఖాతాలు క్లోజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది.
ఇందులో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన ‘నో ట్రాన్సాక్షన్ డే’గాను పాటించాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు ఎస్బీఐనే ప్రైవేటు బ్యాంకులు కూడా అనుసరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఎస్బీఐకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. బ్యాంకులు దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని సామాన్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఎస్బీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…