
‘స్పైడర్’ హిందీ డబ్బింగ్ హక్కులు ఇప్పటికే 16 కోట్లకు అమ్ముడై ట్రేడ్ వర్గాలను అవాక్కు చేయగా, తాజాగా ‘జై లవకుశ’ హిందీ హక్కులు కూడా అమ్ముడైపోయినట్లుగా తెలుస్తోంది. అయితే బాలీవుడ్ నాట మహేష్ కున్నంత ఫేం మరియు మార్కెట్ జూనియర్ ఎన్టీఆర్ కు లేదు కాబట్టి, ‘జై లవకుశ’కు 11 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. అయినప్పటికీ ఈ మొత్తం కూడా చాలా ఎక్కువనే చెప్పాలి.
దీంతో తెలుగు సినిమాల వైపు బాలీవుడ్ వర్గాలు ఎంతగా ఎదురుచూస్తున్నాయో అర్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా ‘బాహుబలి 2’ మాదిరే భారీ సక్సెస్ లు అందుకుంటే, బాలీవుడ్ ప్రముఖులంతా టాలీవుడ్ వైపుకు అడుగులు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఆ విధంగా జరగాలని… జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” మరియు ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” సినిమాలు కనకవర్షం కురిపించాలని ఆశిద్దాం.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…