
ఎంబామింగ్ ప్రక్రియ ఓ రెండు గంటల సమయం పట్టనుంది, అలాగే దుబాయ్ నుండి ఇండియాకు రావాలంటే మరో మూడు గంటలు సమయం పట్టనుంది. అలాగే విమానాశ్రయం నుండి శ్రీదేవి ఇంటికి చేరుకోవడానికి మరో గంట నుండి రెండు గంటల సమయం పట్టనున్న నేపధ్యంలో… మొత్తంగా మంగళవారం నాడు రాత్రి సమయానికి గానీ, బుధవారం వేకువ జామునకు గానీ ‘అతిలోకసుందరి’ చివరిచూపుకు ముంబై వేదిక అవనుంది.
అభిమానులు మరియు సెలబ్రిటీల సందర్శనార్ధం బుధవారం నాడు పార్థీవ దేహాన్ని ముంబైలోని శ్రీదేవి ఇంటి వద్ద అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అనిల్ కపూర్ ఇంట్లో ఉన్న శ్రీదేవి మొదటి తనయురాలు జాహ్నవిని పలకరించగా, చాలామంది సెలబ్రిటీలు బుధవారం నాడు ప్రత్యక్షం కానున్నారు. ఇక టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్తారో వేచిచూడాలి. ఇప్పటికే వెంకటేష్ అయితే ముంబై చేరుకున్నారు.
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…