
సురేందర్ రెడ్డి గత చిత్రం ‘కిక్ 2’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు చరణ్ ఓకే చెప్పాడు. అయితే స్క్రిప్ట్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చెబుతూ, సినిమా షూటింగ్ను వేగంగా జరగకుండా చరణ్ చేస్తున్నట్లుగా దర్శకుడు సురేందర్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆరోపించాడట. ఆ విషయం చరణ్ వద్దకు చేరి దర్శకుడు సురేందర్ రెడ్డిపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సైతం దర్శకుడు సురేందర్ రెడ్డిపై కాస్త సీరియస్ అయినట్లుగా సమాచారం.
దాంతో ప్రస్తుతం సురేందర్ రెడ్డి కాస్త తగ్గి ఉంటున్నాడు అని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ మొదటి వారంలోనే దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా, అరవింద్ స్వామి ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…