
జయలలిత మృతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, తమిళనాట ప్రజల్లో ఉన్న అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత అపోలో ఆసుపత్రిపై ఉందని అన్నారు. జయలలితను చూసేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను అనుమతించలేదన్న విషయం తనకు తెలియదని చెప్పారు. అమ్మ మరణ వార్త ప్రకటనకు ముందే పార్టీ శాసనసభ్యుల సమావేశం నిర్వహించడమనేది పూర్తిగా పార్టీ అంతర్గత విషయమని, అయితే ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు ముగియక ముందే శశికళ నాయకత్వం వహించాలంటూ డిమాండ్లు తెరపైకి రావడం బాధాకరమని అన్నారు.
ఇలాంటి తొందరపాటుతో చర్యలతో పలు ప్రశ్నలు, అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరించారు. అంతా వారి అధీనంలోనే ఉన్నప్పుడు, వేరెవరూ లాగేసుకునే అవకాశం లేనప్పుడు తొందర ఎందుకని ప్రశ్నించిన ఆనంద్ రాజ్, నెమ్మదిగా కార్యాచరణలోకి దిగాలని సూచించారు. శశికళ నాయకత్వాన్ని కోరుకోవడం అనేది వారి వారి వ్యక్తిగత విషయమని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నా కార్యకర్తగా తాను సేవలందిస్తానని స్పష్టం చేశారు.
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…