
ఈ ఘటనపై అయ్యన్న పాత్రుడి అర్ధాంగి పద్మావతి విలేఖరులతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం, పోలీసుల దౌర్జన్యాలు భరించలేనంతగా పెరిగిపోయాయి. రాత్రి 2 గంటలకు సుమారు 200 మంది పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి గోడలు దూకి దౌర్జన్యంగా మా ఇంట్లోకి ప్రవేశించారు. ఇలా అర్ధరాత్రి గోడ దూకి మా ఇంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఏముంది? అడిగితే నేనే తలుపు తీసి లోనికి రానిచ్చేదానిని కదా.. అని నేను వారిని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
వారిలో కొందరు తాగి ఉన్నారు. అదే నేను అడిగితే మేమేమీ తాగలేదు కావాలంటే చూస్కో అంటూ నా మొహం మీద నోటితో గాలి ఊదారు. గత మూడున్నరేళ్ళుగా జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఏదోవిదంగా వేధిస్తూనే ఉంది. మేమేమైన గంజాయి అమ్ముతున్నామా లేక ఉగ్రవాదులమా? ఇలా అర్ధరాత్రి మా ఇంటిని చుట్టుముట్టి గోడ దూకి ఇంట్లో ప్రవేశించి పట్టుకోవడానికి.
కనీసం మావారిని చెప్పులు కూడా వేసుకోనీయకుండా పోలీసులు బలవంతంగా ఈడ్చుకుపోయారు. ముందు కారులో తీసుకువెళతామన్నారు కానీ జీపులో కూర్చోబెట్టి తీసుకుపోయారు. నా ఇద్దరు కొడుకులని, ఆయనని వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారో, ఏం చేయబోతున్నారో తెలియదు. కానీ వారికి ఏ హాని జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను ఇంత దిగజార్చేస్తారని అనుకోలేదు. ఆయనకి మరీ ఇంత పైశాచిక ఆనందం అవసరమా?” అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు చింతకాయల పద్మావతి.
Rohit Sharma and Virat Kohli have retained their places in India’s ODI squad for the…
Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…