
ఈ సందర్భంగా నారా లోకేష్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలని తమ ప్రభుత్వమే ఆదుకొంటోందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటారు. కానీ వారి కోసం మొదలుపెట్టిన ఈ రెండు సామాజిక భవనాలని సైతం పూర్తి చేయకుండా అర్దాంతరంగా వదిలేశారు. ఎందుకు? వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు మాటలతో అందరినీ మభ్యపెట్టాలని ప్రయత్నిస్తుంటారని చెప్పడానికి ఈ భవనాలే నిదర్శనం.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే సిఎం జగన్ తాడేపల్లి ప్యాలస్లో ఉండే నలుగురూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. వైసీపీలో బీసీ నేతలందరూ తాడేపల్లి ప్యాలస్ బయటే ఉండిపోతుంటారు. ఇదే… వైసీపీ చెప్పుకొనే గొప్ప సామాజిక న్యాయం. కనుక బీసీ ప్రజలు, వారి నాయకులు వైసీపీ నేతల చేతిలో మోసపోతున్నామని గ్రహించాల్సిన అవసరం ఉంది. టిడిపి మాత్రమే అన్ని వర్గాల ప్రజలని సమానంగా గౌరవించి ఆదరిస్తుంది,” అని అన్నారు.
నారా లోకేష్ మరికొద్ది సేపటిలో కలమలదొడ్డి క్యాంప్ సైట్కి చేరుకొని భోజనం చేసిన తర్వాత స్థానిక పార్టీ నేతలతో సమావేశమవుతారు. మళ్ళీ 3 గంటలకు పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 6.45 గంటలకి శాంతిపురం చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
Toxic has been a painful chapter for Yash and his team. But the actor’s response…
New data is showing that H-1B petitions from Indian companies in the US have dropped…