
‘హ్యాట్రిక్ సిరీస్’ లక్ష్యంగా కరీబియన్ గడ్డపై కాలు మోపిన కోహ్లీ సేన తొలి టెస్టులోనే 63 ఏళ్ళ భారత క్రికెట్ చరిత్రను తిరగరాసింది. అంటిగ్వాలో ముగిసిన తొలి టెస్టును టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో చేజిక్కించుకుని, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. 63 ఏళ్లుగా విండీస్ లో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటిదాకా ఇన్నింగ్స్ తేడాతో కరిబీయన్ జట్టుపై విజయం సాధించింది లేకపోవడం విశేషం. భారత జట్టు తరఫున హేమాహేమీలు వెళ్లినా సాధ్యం కాని రికార్డు విజయాన్ని కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సాధించాడు.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ… తన కెరీర్ లోనే డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, స్పిన్నర్ గా బరిలోకి దిగిన రవిచంద్రన్ అశ్విన్ కూడా తన కెరీర్ లోనే తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండిస్ జట్టును భారత బౌలర్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి ఫాలో ఆన్ లో పడేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండిస్ బ్యాటింగ్ ఆర్డర్ ను 231 పరుగులకే అశ్విన్ 7 వికెట్లతో కుప్పకూల్చాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో టీమిండియా ఘన విజయానికి బాటలు వేసిన అశ్విన్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
The interesting part of the Epic trailer launch was not just Vijay Deverakonda’s absence and…
Karthi is returning to the silver screen with the highly anticipated spy thriller Sardar 2,…