
మొదటి విడతలో భాగంగా మునిసిపల్, అర్బన్ డెవలప్మెంట్ అధికార యంత్రాగం తొలుత 15 మునిసిపాలిటీలను ఎంచుకుని పూర్తిస్థాయిలో టాయిలెట్లు నిర్మించడంపై దృష్టి సారించనుంది. అక్కడ లక్ష్యాన్ని చేరుకున్న అనంతరం మిగతా 42 మునిసిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. రెండో విడతలో భాగంగా 20 మునిసిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని డెడ్లైన్ విధించనున్నారు. మరో 11 మునిసిపాలిటీలకు అక్టోబరు 2 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు.
26 మునిసిపాలిటీలకు వచ్చే ఏడాది జనవరి 26, మిగిలిన ఆరింటికి మార్చి 31, 2017 వరకు గడువు ఇచ్చి ఆ లోగా టాయిలెట్ల నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర మూడో ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని వంద శాతం టాయిలెట్లు కలిగిన రాష్ట్రంగా ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణా సర్కార్ పెట్టుకున్న ఈ లక్ష్యం నెరవేరాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…