
అయితే అభిమానులకు షాక్ ఇచ్చేలాంటి వార్తలు వెలువరించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ట్విట్టర్ లో ప్రవేశించిన తర్వాత మొదట ట్వీట్ గా మహేష్ బాబు 25వ చిత్రం తన దర్శకత్వంలోనే రూపొందనుందని ప్రకటించారు. ఈ సినిమాను మెగా నిర్మాత అశ్వనీదత్ మరియు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించబోతున్నారని స్పష్టం చేసారు. ఈ ప్రకటనతో అవాక్కవ్వడం ప్రిన్స్ అభిమానుల వంతయ్యింది.
ఈ ఉదంతంతో ప్రిన్స్ వైఖరి స్పష్టంగా కనపడుతోంది. 24, 25 అనేవి కేవలం తన వరకు సంఖ్యలే తప్ప, తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యత లేదన్న విషయాన్ని మహేష్ బాబు చెప్పకనే చెప్పారు. అయితే ఎట్టకేలకు ప్రిన్స్ 25వ సినిమాపై స్పష్టత వచ్చింది. 23వ సినిమాగా మురుగదాస్, 24 కొరటాల, 25 వంశీ పైడిపల్లి ఫిక్స్ కావడంతో… ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ తో ఎప్పుడు సినిమా ఉంటుందా? అన్న ప్రిన్స్ ఫ్యాన్స్ ను వేధిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…