
అయితే ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో మాత్రం బొక్కబోర్లా పడడం అభిమానులకు నిరాశ కలిగించింది. పేలవమైన ప్రదర్శనతో విమర్శల పాలైన ఈ మ్యాచ్ సెంటిమెంట్ ను పరిశీలిస్తే… టీ 20 సిరీస్ కూడా మనదే అన్న రీతిలో అభిమానులు రెచ్చిపోవడం ఖాయం. ఎందుకంటే, విరాట్ కోహ్లి నాయకత్వం వహించిన మొదటి మ్యాచ్ లు ఓటమి పాలు కావడం, ఆ తర్వాత విజయవంతమైన జట్టుగా నిలపడం ఆనవాయితీగా వస్తోందన్న విషయాన్ని టెస్టులు, వన్డే మ్యాచ్ లు స్పష్టం చేసాయి.
విరాట్ కోహ్లి కెప్టెన్ గా వ్యవహరించిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అలాగే కోహ్లి మొదటిసారిగా నాయకత్వం వహించిన వన్డే మ్యాచ్ లో కూడా టీమిండియా 161 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అదే సెంటిమెంట్ ను అనుసరిస్తూ మొదటి టీ 20లో కూడా 7 వికెట్ల తేడాతో ఖంగుతింది. అయితే ఆ రెండు లక్ష్య చేధనలో ఓటమి పాలు కాగా, టీ20లో మాత్రం లక్ష్యాన్ని ఇచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. సెంటిమెంట్ ప్రకారమే అయితే టెస్టులు, వన్డేల మాదిరే పడిలేచిన కెరటంలా, టీ20లోనూ జట్టును విజయవంతంగా తీసుకెళ్లడంలో విరాట్ కోహ్లి సక్సెస్ అవుతాడన్న మాట.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…