
జీఎస్టీ విధానం చాలా క్లిష్టమైనదని పేర్కొన్న వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో రెండో అతి పెద్ద పన్ను రేటు భారత్ దేనని స్పష్టం చేసింది. జీఎస్టీలో భాగంగా భారత్ లో ప్రస్తుతం ఐదు పన్ను శ్లాబులున్నాయని తెలిపింది. 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను విధానాలు అమలులో ఉన్నాయని చెప్పింది. ఈ ఐదు శ్లాబులు కాకుండా బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్ను విధానం, విలువైన రాళ్లకు 0.25 శాతం పన్ను విధానం అమలులో ఉందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.
జీఎస్టీ నుంచి ఆల్కాహాల్, పెట్రోలియం, స్టాంపు డ్యూటీలు, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రిసిటీ డ్యూటీలను మినహాయించారని గుర్తుచేసింది. జీఎస్టీని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్న దేశాల్లో 49 దేశాలు ఒకే శ్లాబును కలిగి ఉన్నాయని చెప్పింది. మరో 28 దేశాలు రెండు శ్లాబులను కలిగి ఉన్నాయని తెలిపింది. కేవలం భారత్ తో కలిపి ఐదు దేశాలే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ శ్లాబులు కలిగి ఉన్నాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ఇందులో కూడా ప్రపంచ దేశాల్లో అత్యధిక పన్ను రేటు కలిగిన దేశంగా ఇండియా ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…