జగన్ వెనకేసింది ఒక లక్ష కోట్లు కాదు, 6 లక్షల కోట్లు!

వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి లక్షల కోట్లు వెనకేసుకున్నారని, బెంగుళూరులోని జగన్ నివాసం, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఇందుకు సజీవ సాక్ష్యాలంటూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల విమర్శలను పక్కన పెడితే, ఈడీ జగన్ ఆస్తులను ఇప్పటికే వేల కోట్లలో స్వాధీనం చేసుకుంది.

తాజాగా జగన్ అక్రమాస్తులపై కడప జిల్లా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి స్పందించారు. జగన్ సొంతూరు అయిన పులివెందుల వేదికగా గుట్టంతా విప్పుతానని సంచలన ప్రకటన చేసిన ఆది, “తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించింది లక్ష కోట్లు అయినప్పటికీ, ఆ అక్రమార్జనకు ఒక రూపాయి వడ్డీ వేసినా 6 లక్షల కోట్లు అవుతుందని” తీవ్ర ఆరోపణలు చేసారు. మొన్నటివరకు వైసీపీలో ఉన్న తానూ జగన్ పని పట్టడానికే తెలుగుదేశం పార్టీలో చేరానన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

ADVERTISEMENT
Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

12 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

17 minutes ago