
అయితే 10 రోజులు తిరగక ముందే జగన్ మదిలో కొత్త ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ప్రకటించేసారు కూడా. అదేంటి అంటే తన పాదయాత్ర పూర్తి అవ్వగానే ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం అని చెప్పుకొచ్చారు ఆయన. పాదయాత్ర తరువాత చేసే బస్సు యాత్రలో ఈ మేనిఫెస్టోలను విడుదల చేస్తారట.
కనీసం మూడు,నాలుగు ప్రదానమైన పనులు ఆయా చోట్ల చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తామని జగన్ తెలిపారు. దీనిని కూడా పనిలో పనిగా పొగిడేశారు సాక్షి వారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల్లోనే తెలుగు దేశం పార్టీ నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు విడుదల చేసింది.
మరోవైపు కడప జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి అయింది. ఏడు రోజుల పాటు (మధ్యలో ఒక రోజు కోర్ట్ బ్రేక్ తో) సాగిన ఈ పాదయాత్రలో 93.8 కిలోమీటర్లు నడిచారు జగన్. ఏడవ రోజు 13.8 కిలోమీటర్ల దూరం నడిచారు ప్రతిపక్ష నేత. ఈరోజు పాదయాత్ర కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతుంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…