
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి విశాఖ జిల్లాలోని తాండవకి వెళ్ళే మార్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకి ఓ రోడ్డు గోతులమయంగా మారింది. అయితే రోడ్డు ఎలా ఉన్నా, బస్సు కండిషన్ ఎలా ఉన్నా ప్రతీరోజూ ఆదేమార్గంలో ప్రయాణించక తప్పదు. కనుక ఆ బస్సు డ్రైవరు, కండక్టరు కలిసి కొన్ని బండరాళ్ళను బస్సులో వేసుకొని దారిపొడవునా గుంతలుపడిన చోట్ల బస్సును ఆపి వాటిని పేర్చుకొంటూ బస్సుని ముందుకు తీసుకువెళ్లారు.
బస్సు డ్రైవరు, కండక్టరూ బస్సులో తెచ్చుకొన్న రాళ్ళను తీసి గోతులపడ్డ బురదరోడ్డులో వరుసగా పేర్చుతుంటే ఓ ప్రయాణీకుడు ఎవరో దానిని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి టిడిపి చేతికి రావడంతో దానికి వ్యంగ్యంగా “నీ రాళ్ళు నువ్వే తెచ్చుకో… నీ రోడ్లు నువ్వే వేసుకో…” అంటూ ట్వీట్ చేసింది. దాంతోపాటు జగన్ ప్రసంగం, ‘రావాలి జగన్… కావాలి జగన్…’ అంటూ సాగే వైసీపీ పాటను కూడా జోడించడం విశేషం. ఈ వీడియో చూసి తీరాల్సిందే. దానిలో సిఎం జగన్ ప్రసంగం విని తీరాల్సిందే.
టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా…
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…