
చిలకలూరి పేట టిడిపి ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న టిడిపి ముఖ్యనాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు జగన్ ప్రభుత్వం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. సి.బి.ఐ విచారణ లో భాగంగా వివేకా హత్య కేసు నిందితులుగా జగన్ కుటుంభసభ్యులే ఉన్నారని, వారిని కాపాడే పనిలో జగన్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. జగన్ కు నైతిక విలువలు ఉంటె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 151 కేసులలో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని ఇప్పుడైనా రాజ్యాంగ బద్ధంగా పాలన కొనసాగించాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎం జరిగినా దానికి చంద్రబాబే కారణం అని విమర్శలు చేయడం మాని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు తన తాడేపల్లి ప్యాలస్ వదిలి బయటకు రావాలని విమర్శలు చేశారు. ఈ నెలలోపే సి.బి.ఐ నిజమైనా హంతకులనే అరెస్ట్ చేస్తే జగన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అని జోస్యం చెప్పారు. ప్రజా వ్యతిరేఖ విధానాలతో ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవనే విషయం వైసీపీ ప్రభుత్వం గుర్తెరిగి మసులు కోవాలని సూచనా చేశారు.
ఇదే విధంగా తమ మొండి వైఖరితో ముందు కెళితే మాత్రం జగన్ ప్రభుత్వానికి టైం… దగ్గర పడుతుందని పుల్లారావు టైం… చూసుకొని మరీ టిడిపి ఆత్మ గౌరవ సభలో నిర్మోహమాటంగా
పేర్కొన్నారు.
Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…
ప్రధాని మోడీ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ఆటంబాంబు లాంటి మాట చెప్పారు. కనీసం ఒక ఏడాది…