
ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు ఉన్న పళంగా పార్టీలో సంక్షోభం మొదలైంది. పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ‘పసుపు’ జెండా కప్పెసుకున్నారు. అంతేకాదు, ఈ రంగు జెండా కోసం మాతో పాటు వచ్చేవారు చాలా మంది ఉన్నారు, కొన్నాళ్ళు వేచిచూడండి అంటూ మీడియా ముఖంగా ప్రకటన కూడా చేసేసారు. దీంతో ఎవరి పేర్లు ఎప్పుడు తెరపైకి వస్తాయోనని మీడియా వర్గాలతో పాటు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
పార్టీ ఈ స్థితిలో ఉంటే, ఏ రాజకీయ నాయకుడైనా ముందుగా తానూ ఉన్న పర్యటనను రద్దు చేసుకుని ముందుగా పార్టీ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పార్టీని వీడిపోయిన ఎమ్మెల్యేల ప్రస్తావనలు పక్కన పెట్టినా, ప్రస్తుతం పార్టీలో ఇంకా ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాగే పార్టీ మార్పు విషయంలో ఉదంతంలో వస్తున్న వారితో ప్రత్యేక చర్చలు జరిపి, వారికి పార్టీపై విశ్వాసం కలిగించాలి. కానీ, జగన్ కు ఆ నాయకత్వ లక్షణాలు పూర్తిగా కొరవడినట్లు మరోసారి స్పష్టమైందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. లేదంటే మిగతా సభ్యులు కూడా జగన్ పై “తిరుగుబాటు” ప్రకటించడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…